Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Police | వీళ్లు మామూలు పోలీసులు కాదు.. చోరీ కేసుల్లో దొరికిన బైకులను అమ్మేశారు..!

Kamareddy Police | వీళ్లు మామూలు పోలీసులు కాదు.. చోరీ కేసుల్లో దొరికిన బైకులను అమ్మేశారు..!

Kamareddy Police | సాధారణంగా వాహనాల దొంగలు బైకులను ఎత్తుకెళ్తే పోలీసులు తిరిగి రికవరీ చేస్తారు. కానీ పోలీసులే బైకులను మాయం చేసేసి ఇతరులకు విక్రయిస్తే..! ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kamareddy Police | కామారెడ్డి జిల్లాలో పోలీసులు దొంగ బండ్లను విక్రయించుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బైకు దొంగతనాలకు సంబంధించిన ఓ కేసు నమోదైనట్లు సమాచారం.

వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసిన 29 టూ వీలర్లను అప్పటి సీఐ చంద్రశేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో రికవరీ చేశారు. ఇందులో కొన్ని టెంపరరీ రిజిస్ట్రేషన్లు, నంబరు​ ప్లేట్లు లేని వాహనాలుగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని సేఫ్​ కస్టడీ నిమిత్తం కామారెడ్డి పోలీస్​ స్టేషన్​లో ఉంచారు. కాగా.. గతంలో పనిచేసిన ఓ అధికారి, మరో కానిస్టేబుల్​ కలిసి ఆ టూ వీలర్లను అమ్ముకున్నట్లు బయటపడిందని సమాచారం.

Kamareddy Police | తనిఖీల్లో బయటపడ్డ వైనం..

తాజాగా.. కామారెడ్డి పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలోనే పోలీసులకు దొరికిన (దొంగతనం చేయబడిన బండి) టూ వీలర్​ను ఓ వ్యక్తి నడుపుతుండగా సీజ్​ చేశారు. చేసిస్​​ నంబర్​ ఆధారంగా పూర్తి వివరాలు రాబట్టగా మైలార్​ దేవునిపల్లికి చెందిన వారిదిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా.. సదరు వాహనం చోరీకి గురైందని.. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​లోనే రికవరీ చేసినట్లు సమాచారం.

అయితే సదరు వాహన యజమానికి ఇప్పటి వరకు బండి అందలేదని తెలిసింది. మరోవైపు పోలీస్​ స్టేషన్​ నుంచే కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు మెకానిక్​కు వాహనాన్నివిక్రయించినట్లు తెలుస్తోంది. అప్పటి ఎస్​హెచ్​వోకు తెలిసే ఈ తంతు జరిగినట్లు సమాచారం. ఏదేమైనా దొంగతనాలకు గురైన వాహనాలను రికవరీ చేసి, బాధితులకు తిరిగి ఇవ్వాల్సిన పోలీసులే.. వాటిని దొడ్డిదారిలో విక్రయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Must Read
Related News