అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Elections | మూడేళ్లలో కామారెడ్డిలో మార్పు తేకపోతే తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Katipalli Venkata Ramanareddy) అన్నారు. మార్పు కోసం, బంగారు భవిష్యత్తు కోసం ప్రజలే నిర్ణయం తీసుకోవాలని, మున్సిపాలిటీలో బీజేపీకి పట్టం కట్టాలని కోరారు.
Kamareddy Municipal Elections | భారీ బైక్ ర్యాలీ..
ఎన్నికల ప్రచారం చివరిరోజు సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి మల్లన్న ఆలయం నుంచి పట్టణంలోని 49 వార్డుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది బైకులు, 49 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన ప్రచార వాహనాలతో కామారెడ్డి (Kamareddy)లో కాషాయ జెండాలు రెపరెపలాడాయి. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కామారెడ్డి భవిష్యత్తు పట్టణ ప్రజల చేతిలో ఉందన్నారు. కబ్జాదారులు కావాలా..? అభివృద్ధి కావాలా..? సేవ చేసేవాళ్లు కావాలా..? సెటిల్మెంట్లు చేసేవాళ్లు కావాలా..? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
Kamareddy Municipal Elections | నిజాయితీగా వార్డుల అభివృద్ధికి కృషి..
నిజాయితీగా వార్డుల ను అభివృద్ధి చేసేందుకు బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, మున్సిపాలిటీలో ఛైర్మన్ అయ్యేది బీజేపీ అభ్యర్థేనని (BJP Candidate) ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన కౌన్సిలర్లు ఒక్క రూపాయి కూడా ఆశించరని, అవినీతి లేకుండా సేవ చేస్తారని తెలిపారు. అవినీతి రహిత పాలన చేయకపోతే తాను మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. భూ బకాసురులు, దొంగలు, అవినీతి పరులు అంతా ఒకే చోటకు చేరారని, అందరూ కలిసి టీంగా వస్తున్నారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారన్నారు. రూ. లక్షలు, కోట్లు ఖర్చుచేసి ఎందుకు గెలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని మున్సిపాలిటీ నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారు.