Kamareddy Congress | ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను సన్మానించిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Congress | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మల్లికార్జున్ పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​(Mla Madan Mohan Rao) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్​స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. అందు కోసం శ్రమించాలని సూచించారు. 2029లో రాహుల్ గాంధీని(Rahul […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy Congress | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మల్లికార్జున్ పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​(Mla Madan Mohan Rao) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్​స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలతో మమేకం కావాలన్నారు. అందు కోసం శ్రమించాలని సూచించారు.

2029లో రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రధానమంత్రిగా చూడాలంటే సంకల్పంతో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేయాలని సూచించారు. అలాగే ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Exam Center Security | పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: ఎస్పీ రాజేష్ చంద్ర

పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

TTD Digital Offerings | తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త నిర్ణయం.. ‘శ్రీవారి ముడుపు పత్రం’తో డిజిటల్ కానుకల సౌకర్యం

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు డిజిటల్ రూపంలో హుండీ కానుకలు సమర్పించేందుకు టీటీడీ ‘శ్రీవారి ముడుపు పత్రం’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించి ప్రత్యేక పత్రాన్ని హుండీలో వేయే సౌకర్యం కల్పించనుంది.

Tirumala Ghat Road Accident | తిరుమల ఘాట్​ రోడ్డులో ప్రమాదం.. ఒకరి మృతి

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన భక్తుడు మృతి చెందాడు.

Armur Municipal Council | ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్​గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు.