Homeజిల్లాలునిజామాబాద్​Kalvakuntla Kavitha | కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha | కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

ఇటీవల రౌడీషీటర్​ దాడిలో మృతిచెందిన కానిస్టేబుల్​ ప్రమోద్​ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Kalvakuntla Kavitha | ఇటీవల రౌడీషీటర్​ రియాజ్​ దాడిలో మృతిచెందిన సీసీఎస్​ కానిస్టేబుల్ ప్రమోద్ (CCS Constable Pramod)​​ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్​ సతీమణితో మాట్లాడారు. చిన్నారుల బాగోగులను తెలుసుకున్నారు. జాగృతి (Telanagana Jagruthi) పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్​శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

రౌడీషీటర్​ రియాజ్​ను విచారణ నిమిత్తం పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్తుండగా సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​పై దాడిచేయగా కానిస్టేబుల్​ సంఘటనా స్థలంలోనే మృతిచెందిన విషయం తెలిసిందే. అనంతరం రెండు రోజుల తర్వాత నిజామాబాద్​ జీజీహెచ్​లో తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో పోలీసుల కాల్పుల్లో రౌడీషీటర్​ రియాజ్​ సైతం హతమైన విషయం విదితమే.

Must Read
Related News