MLC Kavitha | రియల్​ ఎస్టేట్ కోసం ఊరి చివర కలెక్టరేట్​ నిర్మాణం : ఎమ్మెల్సీ కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్​రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్​ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు. జాగృతి జనంబాటలో భాగంగా కవిత సూర్యాపేటలో మాట్లాడారు. ఊరు మధ్యలో కట్టాల్సిన సూర్యాపేట కలెక్టరేట్​ను (Suryapet Collectorate) ఊరు అవతల కట్టారన్నారు. సూర్యాపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో, ప్రైవేట్​ వెంచర్​లో కలెక్టరేట్​ కార్యాలయం నిర్మించారన్నారు. రూ.25 లక్షలకు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్​రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్​ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు.

జాగృతి జనంబాటలో భాగంగా కవిత సూర్యాపేటలో మాట్లాడారు. ఊరు మధ్యలో కట్టాల్సిన సూర్యాపేట కలెక్టరేట్​ను (Suryapet Collectorate) ఊరు అవతల కట్టారన్నారు. సూర్యాపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో, ప్రైవేట్​ వెంచర్​లో కలెక్టరేట్​ కార్యాలయం నిర్మించారన్నారు. రూ.25 లక్షలకు ఎకరా చొప్పున 25 ఎకరాలు తీసుకొని నిర్మాణం చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా భూములు నష్టపోయిన రైతులకు ఇంత పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వలేదన్నారు. ఆ వెంచర్​ వరకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు వేశారన్నారు. సూర్యపేట జగదీశ్​రెడ్డి (Jagadish Reddy) స్పెషల్​ కావడంతో పరిహారం ఎక్కువ వచ్చిందని ఎద్దేవా చేశారు.

MLC Kavitha | విచారణ చేపట్టాలి

కలెక్టరేట్​ కట్టిన అనంతరం జగదీశ్​రెడ్డి స్నేహితులు ఇన్వాల్వ్​ అయి వెంచర్​ను 500 ఎకరాలకు డెవలప్​ చేశారన్నారు. దీంతో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. రియల్​ ఎస్టేట్​ కోసమే అక్కడ కలెక్టరేట్​ కట్టారని ఆరోపించారు. ఉత్తమ్​ కుమార్​రెడ్డి, జగదీశ్​రెడ్డి స్నేహితులు కావడంతో దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టడం లేదన్నారు. కలెక్టరేట్​ నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్​ చేశారు.

MLC Kavitha | కస్టం మిల్లింగ్​ స్కామ్​

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రూ.వెయ్యి కోట్ల కస్టం మిల్లింగ్​ స్కామ్​ జరిగిందని కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో నిందితులు ఇప్పటికి దర్జాగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన అనుచరులు కర్నాల చెరువును ఆక్రమించి వెంచర్​ చేశారన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Related articles

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.