Homeతాజావార్తలుKalvakuntla Kavitha | ‘తెలంగాణ యాత్ర’కు కల్వకుంట్ల కవిత శ్రీకారం.. ఎప్పటి నుంచంటే..?

Kalvakuntla Kavitha | ‘తెలంగాణ యాత్ర’కు కల్వకుంట్ల కవిత శ్రీకారం.. ఎప్పటి నుంచంటే..?

తెలంగాణ యాత్ర పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kalvakuntla Kavitha | ‘తెలంగాణ యాత్ర’ (Telangana Yatra) పేరుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్​ చివరి వారంలో యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్నిజిల్లాల మీదుగా యాత్ర ఉండనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.

Kalvakuntla Kavitha | మేధావులు, విద్యావంతులతో భేటీలు..

యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లో ఆమె పలువురు మేధావులు.. విద్యావంతులతో భేటీలు నిర్వహించనున్నారు. పలు వేదికలపై ప్రసంగించనున్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ (Congress government) వైఫల్యాలను ఎండగడుతూ.. జాగృతి ఆధ్వర్యంలో ఏళ్లుగా చేస్తున్న సేవలను వివరించనున్నారు. యాత్రకు సంబంధించి బుధవారం స్పష్టమైన వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

Kalvakuntla Kavitha | కేసీఆర్​ ఫొటో లేకుండానే..

బీఆర్​ఎస్​లో హరీష్​రావు, సంతోష్​రావులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన అనంతరం ఆమెపై పార్టీ వేటు వేసింది. ఈ సందర్భంగా ఆమె నెలకొల్పిన తెలంగాణ జాగృతి (Telangana Jagruti) సంస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీంట్లో భాగంగానే రాష్ట్రమంతా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కేసీఆర్​ ఆనవాళ్లు లేకుండా ప్రొఫెసర్​ జయశంకర్​ ఫొటోతో యాత్ర పోస్లర్లు రిలీజ్​ చేసే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆమె తన కుటుంబాన్ని పూర్తిగా పక్కకు పెట్టి రాజకీయాల్లో ముందుకు సాగనున్నట్లు అర్థమవుతోంది.