ePaper
More
    HomeతెలంగాణKaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో?

    Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో కమిషన్​ నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram project) నిర్మాణంలో అవకతవకలు, మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం పీసీ ఘోష్​ ఛైర్మన్​గా కమిషన్​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్​ జులై 31న తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.

    కాళేశ్వరం కమిషన్​ 115 మంది అధికారులు, మాజీ సీఎం కేసీఆర్​ (former CM KCR), మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​, పనులు చేపట్టిన కాంట్రాక్ట్​ సంస్థ ప్రతినిధులను విచారించింది. సీల్డ్​ కవర్​లో తన నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అందజేయనుంది.

    READ ALSO  Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్‌ గడువు పొడిగింపు.. మూడు రోజుల్లో ప్రభుత్వానికి చేరనున్న నివేదిక

    Kaleshwaram Commission | కమిటీ సభ్యులతో మంత్రి భేటీ

    నిపుణుల కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదివారం భేటీ కానున్నారు. కమిషన్‌ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయినట్లు సమాచారం. సాయంత్రానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో వారితో మంత్రి సమావేశమై చర్చించనున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్​ సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) సైతం సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Kaleshwaram Commission | ఎలాంటి చర్యలు తీసుకుంటారో..

    కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్​ కుటుంబం (KCR family) కమీషన్ల కోసమే దీనిని కట్టిందని సీఎం రేవంత్​రెడ్డి సైతం పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కమిషన్​ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ సమావేశంలో కమిషన్​ నివేదికపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

    READ ALSO  Weather Updates | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

    Latest articles

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    More like this

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...