HomeతెలంగాణHarish Rao | కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్​రావు

Harish Rao | కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన హరీశ్​రావు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​కు సభలో సంతాపం తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్​ నివేదికను ప్రవేశ పెట్టడానికి సిద్ధం అయింది.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్​రావు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ (House Motion Petition) దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు ముందు హరీశ్​రావు (Harish Rao) అసెంబ్లీ వద్ద మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. శ్రీధర్‌బాబు వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరన్నారు. నిజాలు తేల్చాల్సింది కోర్టు అని వ్యాఖ్యానించారు.

Harish Rao | బీఆర్​ఎస్​లో ఆందోళన

కాళేశ్వరం నివేదికపై (Kaleshwaram Report) బీఆర్​ఎస్​లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్​పై బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది పీసీ ఘోష్​ కమిషన్ కాదని పీసీసీ కమిషన్​ అని​ వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అక్రమాలు, డిజైన్​ మార్పులపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్​ జులై 31న నివేదిక సమర్పించింది. కేసీఆర్​ తీరుతోనే ప్రాజెక్ట్​ కుంగిపోయిందని కమిషన్​ పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెడితే బీఆర్​ఎస్​కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

Harish Rao | స్థానిక ఎన్నికల వేళ

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రానున్నాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్​ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్​ నివేదిక పెట్టాలని నిర్ణయించింది. అయితే దీనిపై చర్చ జరిగితే స్థానిక ఎన్నికల్లో పార్టీ నష్టం జరుగుతుందని బీఆర్​ఎస్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీశ్​రావు హైకోర్టు (High Court) ఆశ్రయించడం గమనార్హం.