అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు సభలో సంతాపం తెలిపారు. అసెంబ్లీలో ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశ పెట్టడానికి సిద్ధం అయింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ (House Motion Petition) దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు ముందు హరీశ్రావు (Harish Rao) అసెంబ్లీ వద్ద మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కాళేశ్వరంపై తాము సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. శ్రీధర్బాబు వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరన్నారు. నిజాలు తేల్చాల్సింది కోర్టు అని వ్యాఖ్యానించారు.
Harish Rao | బీఆర్ఎస్లో ఆందోళన
కాళేశ్వరం నివేదికపై (Kaleshwaram Report) బీఆర్ఎస్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని పీసీసీ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అక్రమాలు, డిజైన్ మార్పులపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్ జులై 31న నివేదిక సమర్పించింది. కేసీఆర్ తీరుతోనే ప్రాజెక్ట్ కుంగిపోయిందని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెడితే బీఆర్ఎస్కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Harish Rao | స్థానిక ఎన్నికల వేళ
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) రానున్నాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పెట్టాలని నిర్ణయించింది. అయితే దీనిపై చర్చ జరిగితే స్థానిక ఎన్నికల్లో పార్టీ నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీశ్రావు హైకోర్టు (High Court) ఆశ్రయించడం గమనార్హం.