అక్షరటుడే, వెబ్డెస్క్ : Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్ట్తో Kaleshwaram project పాటు అన్నారం annaram, సుందిళ్ల sundilla బ్యారెజీలు కూడా ఉండవని ఎన్డీఎస్ఏ ndsa నివేదిక ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి komatireddy అన్నారు. తమకు ఆ విషయం ఆరు నెలల క్రితమే తెలుసని.. అందుకే ఆ బ్యారెజీల్లో నీరు నిల్వ ఉంచలేదన్నారు. ఆ రిపోర్టు తాజాగా బయటకు రావడంతో అవగాహన లేకుండా కేటీఆర్ ktr మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి komatireddy విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు లేకున్నా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండించామని మంత్రి తెలిపారు.
డిజైన్ మార్చడం, నాణ్యతాలోపంతోనే కాళేశ్వరం కూలిపోయిందని కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ kcr స్వయంగా ఇంజినీర్ అవతారం ఎత్తి డిజైన్ గీశానని చెప్పుకున్నాడని గుర్తు చేశారు. కేసీఆర్ అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన మూడేళ్లకే కూలడం నిజంగా ఎనిమిదో వింతేనని మంత్రి ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు చిన్నగా కుంగింది అన్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అన్నారం, సుందిళ్ల బ్యారెజీలు కూడా ఉండవని ఎన్డీఎస్ఏ నివేదికపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.