Kaleshwaram Commission
Kaleshwaram Commission | విచారణ నివేదిక సమర్పించిన కాళేశ్వరం కమిషన్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్​ విచారణ నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్​ విచారణ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో మరో మూడు రోజులు గడువు పొడిగిస్తారని ప్రచారం జరిగింది. అయితే కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​(Commission Chairman PC Ghosh) గడువులోగా తుది నివేదికను అందించారు. గురువారం ఉదయం ఆయన నివేదికను నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు (Rahul Bojja) సమర్పించారు. ఆయన దానిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు (Ramakrishna Rao) అప్పగించనున్నారు.

Kaleshwaram Commission | సుదీర్ఘ విచారణ

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయాని కాంగ్రెస్​, బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​ పేరిట కేసీఆర్​ కుటుంబం రూ.కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించాయి. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్​లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కొన్ని పియర్స్​ దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ 2024 మార్చి 14న జస్టిస్​ పీసీ ఘోష్​ ఛైర్మన్​గా కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపిన కమిషన్​ తాజాగా నివేదిక సమర్పించింది.

Kaleshwaram Commission | 115 మందిని విచారించిన కమిషన్​

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అక్రమాలు, డిజైన్​ మర్పు, నిధుల విడుదల, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పు ఎందుకు చేశారని కమిషన్​ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నించింది. దాదాపు 115 మందిని కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ విచారించారు. మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​ను సైతం కమిషన్ ప్రశ్నించింది. వారందరి వాంగ్మూలాలు రికార్డు చేసింది. ఈ మేరకు తుది నివేదికను సిద్ధం చేసి ఇరిగేషన్​ శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జాకు కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్​ సమర్పించారు.