HomeతెలంగాణMP Laxman | మొన్న కాళేశ్వరం కూలింది.. నిన్న బీఆర్‌ఎస్‌ కూలింది : ఎంపీ లక్ష్మణ్​

MP Laxman | మొన్న కాళేశ్వరం కూలింది.. నిన్న బీఆర్‌ఎస్‌ కూలింది : ఎంపీ లక్ష్మణ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Laxman | బీఆర్​ఎస్​లో చోటు చేసుకున్న పరిణామాలపై బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్​ స్పందించారు. కాళేశ్వరం కూలినట్లే.. బీఆర్​ఎస్​ కూలిందని ఆయన వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం మూడు పిల్లర్లు కుంగినట్లు.. బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party) మూడు ముక్కలైందని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేశా చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​ అవినీతి విషయంలో సీబీఐ దర్యాప్తు జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అయితే 22 నెలలుగా సీఎం రేవంత్​రెడ్డి ఎం చేశారని ప్రశ్నించారు.

MP Laxman | నివేదికపై అసంతృప్తి

కాళేశ్వరం కమిషన్​ నివేదికపై ఎంపీ లక్ష్మణ్(MP Laxman)​ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్​లో అవినీతి జరిగిందని గతంలో కాగ్​ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కానీ పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) నివేదికలో క్రిమినల్ రిఫరెన్స్ లేవని, నాయకులు, అధికారులు, కాంట్రాక్టుల పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు.

MP Laxman | ఆస్తులు కొల్లగొట్టారు

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సోమవారం మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతికి హరీశ్​రావు, సంతోష్​రావు కారణం అని వ్యాఖ్యానించారు. దీనిపై లక్ష్మణ్​ స్పందించారు. వారిద్దరు అవినీతి ఆనకొండలని కవిత చెప్పారన్నారు. కేసీఆర్​ కుటుంబం తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టిందని విమర్శించారు. కేసీఆర్(KCR)​ను బలిపశువు చేశారని కవిత అనడంపై ఆయన స్పందిస్తూ.. అవినీతిలో కేసీఆర్ పాత్ర ఉందనుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ(CBI Investigation) జరిపి నిందితులను శిక్షించాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు.

Must Read
Related News