అక్షరటుడే, అమరావతి: Kakinada fishermen | శ్రీలంకలో 52 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ మత్స్యకారులు చివరికి స్వదేశానికి తిరిగి వస్తున్నారు.
ఈ విడుదల వెనుక రాజ్యసభ సభ్యుడు ఎంపీ సానా సతీష్ బాబు కీలక పాత్ర పోషించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయం, కోస్ట్ గార్డ్ విభాగాల కృషి ఎంతో ఉంది.
Kakinada fishermen | 52 రోజులపాటు నిర్బంధం
వివరాల్లోకి వెళ్తే.. కె. శ్రీను వెంకటేశ్వర్, కరినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రన్మంధం అనే నలుగురు మత్స్యకారులు ఆగస్టు 4న నావిగేషన్ లోపం కారణంగా పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశించారు.
దీంతో శ్రీలంక Sri Lanka నావికాదళం Navy వారిని అదుపులోకి తీసుకుని జాఫ్నా జైలు Jaffna jail కు పంపింది. ఈ ఊహించని పరిణామంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందాయి.
Kakinada fishermen | దౌత్య చర్చలు, ఎంపీ జోక్యం
మత్స్యకారుల విడుదల కోసం భారత కాన్సులేట్ అధికారులు రాజీవ్ నేతృత్వంలో నిరంతర చర్చలు జరిపారు. అయితే కొన్ని ఆటంకాల వల్ల విడుదల ఆలస్యం అయింది.
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎంపీ సానా సతీష్ బాబు రంగంలోకి దిగారు. ఆయన ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీకాంత్ వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ పంకజ్ వర్మతో చర్చలు జరిపారు. వర్మ నేరుగా శ్రీలంక కోస్ట్ గార్డ్ కమాండర్ దినేష్ జేను సంప్రదించడంతో కోర్టు అనుమతులు త్వరగా లభించాయి.
స్వదేశానికి ప్రయాణం, కుటుంబాల్లో ఆనందం
సెప్టెంబరు 26న మధ్యాహ్నం 2 గంటలకు జాఫ్నా జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను శ్రీలంక కోస్ట్ గార్డ్ ఇండియన్ మెరిటైమ్ బౌండరీ లైన్ (IMBL) వరకు తీసుకువచ్చింది.
అక్కడి నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ వారిని స్వీకరించి, సాయంత్రం 6 గంటలకు రామేశ్వరంలోని మండపం బేస్కు చేర్చింది. వారిని అధికారికంగా కుటుంబాలకు అప్పగించిన తర్వాత, వారు సురక్షితంగా కాకినాడకు చేరుకోనున్నారు.
ఈ శుభవార్తతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఘటన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల భద్రత, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయని మరోసారి నిరూపించింది.