Homeతాజావార్తలుHILT Policy | హిల్ట్​ పాలసీపై కేఏ పాల్​ పిటిషన్​.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

HILT Policy | హిల్ట్​ పాలసీపై కేఏ పాల్​ పిటిషన్​.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హిల్ట్​ పాలసీకి వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. భూ కేటాయింపుల కోసం రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HILT Policy | రాష్ట్ర రాజకీయాల్లో హిల్ట్​ పాలసీ దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీతో వేల ఎకరాల భూముల కుంభకోణానికి తెర లేపారని బీఆర్​ఎస్​ (BRS) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేయడానికి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కుట్ర చేశారని కేటీఆర్​ ఆరోపించారు.

ఈ వ్యవహారంపై తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) హైకోర్టులో పిటిషన్​ వేశారు. హిల్ట్​ పాలసీతో ప్రభుత్వ భూములు నాయకుల బినామీల పేర్లకు మీదకు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. మంత్రి పొంగులేటి (Minister Ponguleti) కుమారుడు 70 మందితో వెళ్లి కొ భూమిని కబ్జా చేశారన్నారు. పాల్​ పిటిషన్​పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పాల్​ పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్​ 29కి వాయిదా వేసింది.

HILT Policy | పాలసీ చుట్టూ రాజకీయాలు

పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వేళ హిల్ట్​ పాలసీ జీవో బయటకు రావడంతో ప్రభుత్వం తల పట్టుకుంటుంది. 9 వేలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టాలని చూస్తోందని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బీఆర్​ఎస్​ నాయకులు నగరంలోని పారిశ్రామిక వాడలను సందర్శిస్తున్నారు. తాజాగా కేఏ పాల్​తో పాటు మరో వ్యక్తి సైతం ఈ వ్యవహారంపై పిటిషన్​ వేయడంతో కోర్టుకు చేరింది.

Must Read
Related News