HomeతెలంగాణJubilee Hills by-elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. మైత్రివనం సమీపంలో రూ.25 లక్షల పట్టివేత

Jubilee Hills by-elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. మైత్రివనం సమీపంలో రూ.25 లక్షల పట్టివేత

Jubilee Hills by-elections | గ్రేటర్​ హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఉప ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, అమీర్​పేట్​ మైత్రివనం సమీపంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Jubilee Hills by-elections | గ్రేటర్​ హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ Jubilee Hills అసెంబ్లీ నియోజకవర్గం (assembly constituency) లో ఉప ఎన్నికల సందడి కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. కాగా, అమీర్​పేట్​ మైత్రివనం సమీపంలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఎలక్షన్​ కోడ్​కు విరుద్ధంగా నగదు తరలిస్తున్న వారిని స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ పట్టుకుంది.

మైత్రివనం వద్ద తనిఖీలు చేపడుతున్న సమయంలో TS09FF 6111 నంబరు గల కారులో రూ. 25 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్​లోని వైజాగ్​కు చెందిన శ్రీ జైరాం తలాసియా నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Jubilee Hills by-elections | పంజాగుట్టలోనూ..

పట్టుబడిన నగదును ఎన్నికల కమిషన్ Election Commission మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక మధురానగర్ పోలీసులకు అప్పగించారు. బై ఎలక్షన్​ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.

శ్రీనగర్ కాలనీలో పంజాగుట్ట పోలీసులు నిర్వహించిన తనిఖీల్లోనూ నగదు పట్టుబడింది. ఒక కారులో రూ.4 లక్షల నగదు, 9 చివాస్ రీగల్ మద్యం బాటిళ్లు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకొని, పోలీసులు కేసు నమోదు చేశారు.