Homeతాజావార్తలుBandi Sanjay | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. బండి సంజయ్​ మీటింగ్​కు అనుమతి రద్దు

Bandi Sanjay | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక.. బండి సంజయ్​ మీటింగ్​కు అనుమతి రద్దు

బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్​ సమావేశానికి పోలీసులు అనుమతి రద్దు చేశారు. దీంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​ల్లో పాల్గొని హామీల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ సైతం రోడ్​ షోలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Union Minister Kishan Reddy) మాత్రమే ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మిగతా నేతలు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ ఫైర్​ బ్రాండ్​, కేంద్ర బండి సంజయ్​తో (Bandi Sanjay)​ గురువారం బోరబండలో సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

Bandi Sanjay | అనుమతి ఇచ్చి..

బోరబండలో బండి సంజయ్‌ మీటింగ్‌కు పోలీసులు మొదట అనుమతి ఇచ్చారు. అయితే తాజాగా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ సాయంత్రం మీటింగ్​ జరగాల్సి ఉండగా.. అనుమతి రద్దు చేయడంపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం బోరబండలో మీటింగ్‌ జరిపి తీరుతామని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నారు.

Bandi Sanjay | మీటింగ్​పై ఉత్కంఠ

జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో (Jubilee Hills Constituency) మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకున్న కాంగ్రెస్​ అజారుద్దీన్​ (Azharuddin) మంత్రి పదవి కూడా ఇచ్చింది. మరోవైపు బీఆర్​ఎస్​ సైతం మైనారిటీ ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్​ సమావేశం పెడితే.. హిందువుల ఓట్లు పోలరైజ్​ అయ్యే అవకాశం ఉంది. దీంతోనే ప్రభుత్వం ఆయన సమావేశానికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే అనుమతి లేకున్నా.. బండి సంజయ్​ మీటింగ్ పెట్టి తీరుతామని బీజేపీ నాయకులు ప్రకటించడంతో సాయంత్రం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.