అక్షరటుడే ఇందూరు: ITI Training | ఐటీఐ శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy) తెలిపారు. గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐను సందర్శించారు. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్(Electrician), స్టెనో తదితర ట్రేడ్లకు సంబంధించిన వర్క్ షాప్లను పరిశీలించారు.
ITI Training | స్కిల్ ఇండియాలో భాగంగా..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కిల్ ఇండియా (Skill India) కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో ప్రభుత్వం ఐటీఐ శిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అధునాతన కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కూడా ప్రభుత్వం నెలకొల్పిందని గుర్తు చేశారు.
ITI Training | రైల్వే, బీడీఎస్ కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో..
ఐటీఐలలో శిక్షణను పూర్తి చేసుకున్న విద్యార్థులకు రైల్వే(railway), బీడీఎల్(BDL) తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఐటీఐలలో ప్రవేశాలు పొంది.. తాము ఎంచుకున్న కోర్సుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దక్కించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్(Taher bin, Chairman of the Urdu Academy), ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు.