Jagtial Congress | టికెట్లు ఇవ్వడానికి నువ్వు ఎవరు.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​పై జీవన్​రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagtial Congress | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​పై కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డి (Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎవడివిరా అంటూ రా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల కాంగ్రెస్​లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ (BRS party) నుంచి గెలిచిన సంజయ్​కుమార్​ (Jagtial MLA Sanjay Kumar) కాంగ్రెస్​లో చేరడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డిని కాదని సంజయ్​ సొంతంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagtial Congress | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​పై కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డి (Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఎవడివిరా అంటూ రా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల కాంగ్రెస్​లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. బీఆర్​ఎస్​ (BRS party) నుంచి గెలిచిన సంజయ్​కుమార్​ (Jagtial MLA Sanjay Kumar) కాంగ్రెస్​లో చేరడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డిని కాదని సంజయ్​ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జీవన్​రెడ్డి కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా యన కీలక వ్యాఖ్యలు చేశారు.

Jagtial Congress | మున్సిపల్​ ఎన్నికల వేళ

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మున్సిపల్ ఎన్నికలు (municipal elections) నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో జగిత్యాలలో టికెట్ల విషయంలో మరోసారి జీవన్​రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ కాంగ్రెస్ జెండా మోయని వారు పార్టీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కథ తేలుతుందన్నారు. అసలు పార్టీ టికెట్ ఇవ్వడానికి నువ్వు ఎవరని ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రశ్నించారు.

Jagtial Congress | గెలుపే లక్ష్యంగా..

జగిత్యాల మున్సిపాలిటీలో 50 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని జీవన్​రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లకు టికెట్లు ఇస్తానని అనడం హాస్యాస్పదం అన్నారు. కాంగ్రెస్​ పార్టీ అంగట్లో సరుకు కాదన్నారు. తాము పదేళ్లు కాంగ్రెస్​ జెండా మోశామన్నారు. కార్యకర్తలు అహర్నిశలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని పని చేశారన్నారు. వారికే టికెట్లు ఇస్తామన్నారు. ఎవరికి పడితే వారికి టికెట్లు ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు నచ్చి కాంగ్రెస్​లో చేరానని సంజయ్​ అనడంపై పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అన్నారు.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్ట్​ను ఆదివారం ఆయన సందర్శించారు.