HomeజాతీయంJEE Mains | జేఈఈ మెయిన్స్​ షెడ్యూల్​ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

JEE Mains | జేఈఈ మెయిన్స్​ షెడ్యూల్​ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

JEE Mains | జేఈఈ మెయిన్స్​ పరీక్షల షెడ్యూల్​ను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ విడుదల చేసింది. మొదటి సెషన్​ పరీక్షలకు ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : JEE Mains | జేఈఈ మెయిన్స్​ కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రిపేర్​ అవుతుంటారు. వారికి నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (NTA) కీలక వార్త చెప్పింది. జేఈఈ మెయిన్స్‌ 2026 షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది.

జేఈఈ మెయిన్స్​ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. జనవరి 21 నుంచి 30 మధ్య మొదటి సెషన్​, ఏప్రిల్‌ 1 నుంచి 10 మధ్య సెషన్‌ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల నుంచే ప్రారంభం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్​ 25 నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందన్నారు. సెషన్​ –2 పరీక్షకు జనవరిలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా ఎన్టీఏ జేఈఈ మెయిన్స్​ పరీక్షలను కంప్యూటర్​ బేస్డ్ (CBT)​ విధానంలో నిర్వహిస్తుంది.

పరీక్ష తేదీలను షెడ్యూల్ చేస్తూ NTA ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది. JEE మెయిన్ పరీక్ష రెండు దశలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి విద్యార్థులు తమ పత్రాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.

ఆధార్​ కార్డులో, పదో తరగతి మెమోలో పుట్టిన తేది ఒకేలా ఉండాలి. అలా లేకపోతే ఇప్పుడు అప్​డేట్​ చేసుకోవాలి. తాజా ఫొటోగ్రాఫ్‌, ఇంటి అడ్రస్‌, తండ్రి పేరు ఆధార్​ కార్డులో ఉండాలి. సంబంధిత రిజర్వేషన్లు పొందే విద్యార్థులు కొత్త సర్టిఫికెట్లు తీసుకోవాలి. పూర్తి వివరాల కోసం www.nta.ac.in, https://jeemain.nta.nic.in వెబ్​సైట్​లను సందర్శించాలని అధికారులు సూచించారు. కాగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఎంతోమంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు సన్నద్ధం అవుతుంటారు.