అక్షరటుడే, వెబ్డెస్క్: Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు Security forces సోమవారం భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. పూంచ్ జిల్లాలో Poonch district ఓ ఉగ్రవాద స్థావరం నుంచి భారీ ఆయుధాలు Heavy weapons, మందుగుండు సామగ్రిని ఆధీనంలోకి తీసుకున్నాయి. జమ్మూ కశ్మీర్ పోలీసులు Jammu and Kashmir Police, ఎస్వోజీ SOG సంయుక్తంగా నిర్వహించిన సెర్చింగ్ ఆపరేషన్లో ఐదు IEDలు, వైర్లెస్ సెట్లు స్వాధీనం చేసుకున్నాయని భద్రతా బలగాలు వెల్లడించాయి. కిలో నుంచి ఐదు కిలోల వరకు బరువుతో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న IEDలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. సరిహద్దు జిల్లాలో పేలుళ్లు జరపడానికి ఉగ్రవాదుల terrorists ప్రణాళికలను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు.
Jammu and Kashmir | విస్తృతంగా తనిఖీలు..
ఇటీవల పహల్ గామ్లో Pahalgam జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇది జరిగింది. ఈ ఘోరమైన దాడి తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను security కట్టుదిట్టం చేశారు. రహదారులపై, సున్నితమైన ప్రాంతాలలో అదనపు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కీలకమైన ప్రదేశాలు key locations, పర్యాటక ప్రదేశాల tourist spots దగ్గర క్విక్ రెస్పాన్స్ టీంలను మోహరించారు. అదనంగా పర్యాటకులు బస చేసే అన్ని హోటళ్లలో భద్రతను పెంచారు.