Homeజిల్లాలునిజామాబాద్​Kalvakuntla Kavitha | జిల్లాకు చేరుకున్న తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha | జిల్లాకు చేరుకున్న తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనంబాట’ను కల్వకుంట్ల కవిత నిజామాబాద్​ జిల్లా నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమె శనివారం జిల్లాకు చేరుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, (Telangana Jagruthi) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇందల్వాయి టోల్​ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం ఆమెకు జాగృతి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

Kalvakuntla Kavitha | ‘జనంబాట’ పేరుతో..

రాష్టవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కల్వకుంట్ల కవిత ’జనంబాట’ పేరుతో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రను తన మెట్టినిళ్లయిన నిజామాబాద్​ (Nizamabad) జిల్లా నుంచే ప్రారంభించనున్నారు.

ఇందల్వాయి టోల్​ప్లాజా (Indalwai Toll Plaza) నుంచి ఆమె నగరంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి  చేరుకుని నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా అంతకుముందు నగర శివారులోని ఈనాడు కార్యాలయం నుంచి బైక్​ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జాగృతి కార్యాలయానికి చేరుకుంటారు. కవితకు స్వాగతం పలికిన వారిలో జాగృతిప్రతినిదులు సుదాం రవిచందర్​, లక్ష్మీనారాయణ, అలీం, శ్రీనివాస్​ గౌడ్​, అనిల్​ తదితరులు ఉన్నారు.

All Posts

దేవి తండాలో సేవాలాల్​ మహరాజ్​ ఆలయంలో పూజలు చేస్తున్నకల్వకుంట్ల కవిత తదితరులు

Must Read
Related News