ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistani Former Minister | పాక్‌లో ఉగ్రవాద సంస్థలున్నది నిజమే.. అంగీకరించిన పాకిస్తాన్ మాజీ మంత్రి...

    Pakistani Former Minister | పాక్‌లో ఉగ్రవాద సంస్థలున్నది నిజమే.. అంగీకరించిన పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistani Former Minister | నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ (జేఎం) వంటి సంస్థాలు పాకిస్తాన్​లో ఇప్పటికీ మనుగడలో ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Former Foreign Minister Bilawal Bhutto Zardari) వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదని, అయితే, ఉగ్ర భూతం వల్ల చాలా నష్టపోయిందని అంగీకరించారు. భారతీయ జర్నలిస్టు కరణ్ థాపర్(Indian journalist Karan Thapar)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక అంశాలు వెల్లడించారు.

    Pakistani Former Minister | పహల్గామ్ నిజమైన ఉగ్ర దాడే..

    జమ్మూ కశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్గామ్​లో ఇటీవల జరిగిన దాడి నిజంగానే ఉగ్రవాద దాడి బిలావల్ భుట్టో తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితులు, వారి కుటుంబాల బాధను తాను అర్థం చేసుకున్నానన్నారు. అయితే, పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistani government) లేదా సైన్యం ప్రమేయం లేదని, అవి తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. ఈ దాడిపై పాకిస్తాన్ నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు (international investigation) కోసం ముందుకొచ్చిందని, కానీ ఇండియా ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదని.. దానివల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని నొక్కి చెప్పారు. “గత సంవత్సరం జరిగిన 200 కంటే ఎక్కువ ఉగ్రదాడుల్లో 1,200 మంది పౌరులు సహా మొత్తం 92,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయామని” వివరించారు. ఇది ఇలాగే కొనసాగితే 2025 పాకిస్తాన్ చరిత్రలో అత్యంత రక్తపాత సంవత్సరం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

    READ ALSO  Pakistan | పాక్​లోనే మసూద్​ అజార్​.. దాయాదీ చెప్పేవన్నీ అబద్దాలేనని మరోసారి తేలిపోయింది..!

    Pakistani Former Minister | ఉగ్రవాద సంస్థలు నిజమే..

    ఎల్ఈటీ, జేఎం వంటి గ్రూపులు పాకిస్తాన్​లో పని చేస్తున్నాయని భుట్టో అంగీకరించారు. ఈ గ్రూపులు ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో ఉద్భవించాయని, వీటిలో పనిచేసిన వారు ఒకప్పుడు స్వాతంత్య్ర సమరయోధులుగా పరిగణించబడ్డారని తెలిపారు. తమ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan People Party) (పీపీపీ)తో పాటు తన తల్లి బెనజీర్ భుట్టో ఎప్పుడూ ఈ గ్రూపులకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 9/11 ఉగ్రదాడి తర్వాత ఆయా సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని, అప్పటి నుంచి పాకిస్తాన్ వాటికి వ్యతిరేకంగా వ్యవహరించిందని తెలిపారు. 2008 ముంబై ఉగ్ర దాడుల్లో (Mumbai terror attacks) బాధితులకు న్యాయం జరగడంలో జాప్యానికి భారతే కారణమని ఆరోపించారు. హఫీజ్ సయీద్ గురించి పదేపదే ప్రశ్నించగా, బిలావల్ చిరాకుగా వ్యవహరిస్తూ “మీరు సమాధానం వినకూడదనుకుంటే, నేను ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్తానని” హెచ్చరించారు.

    READ ALSO  Israel | గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు

    Pakistani Former Minister | పరస్పర సహకారం అవసరం..

    ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు ఇండియా, పాకిస్తాన్ (India – pakistan) పరస్పర సహకారంతో పని చేయాల్సిన అవసరం ఉందని బిలావల్ పేర్కొన్నారు. ఉగ్ర బాధితులు పడే బాధ ఎలా ఉంటుందో తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఉగ్రవాద దాడిలో తన తల్లి హత్యకు గురైందని తెలిపారు. ద్వేషం, యుద్ధం గురించి మాట్లాడుకోవద్దని, ప్రతి పాకిస్తాన్ పౌరుడు ఉగ్రవాది లేదా శత్రువు కాదని పేర్కొన్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...