ePaper
More
    HomeతెలంగాణTelangana University | తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదు

    Telangana University | తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గించడం సరికాదు

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University | డిగ్రీ కళాశాలల్లో మూడేళ్లకు ఉన్న తెలుగు భాషను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండేళ్లకు తగ్గించడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు శాఖ (TU Telugu Department) అధ్యాపకులు తెలిపారు. తెయూలోని సైన్స్‌అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల (College of Science and Arts) సెమినార్‌ హాల్‌లో బుధవారం తెలుగు శాఖ అధ్యాపకుల వార్షిక సదస్సు నిర్వహించారు. హెచ్‌వోడీ సీహెచ్‌ లక్ష్మణ్‌ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు.

    యూజీసీ నిబంధనల (UGC regulations) మేరకు భాష, సాహిత్యాల్లో పీజీ కోర్సుకు డిగ్రీలో 20 క్రెడిట్లు ఉండాలనే నియమం ఉందన్నారు. తెలుగు​ను కోర్‌ సబ్జెక్ట్​గా దోస్త్‌లో సోషల్‌ సైన్సెస్, కామర్స్‌ కోర్సుల్లో బకెట్‌ సిస్టంలో చేర్చాలని కోరారు. తద్వారా ఆసక్తిగల విద్యార్థులు తెలుగు చదివే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీన్‌ ప్రొఫెసర్‌ కె.లావణ్య, పి.కనకయ్య, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...