HomeUncategorizedIsrael | ఇజ్రాయెల్​ ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా..

Israel | ఇజ్రాయెల్​ ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel | ఇరాన్​– ఇజ్రాయెల్​ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్​ అణుశక్తి గల దేశంగా మారితే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన ఇజ్రాయెల్​ ఆపరేషన్​ ‘రైజింగ్​ లయన్’ (Operatin Rising Lion)​ పేరిట దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

100కు పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్​ ఇరాన్​పై విరుచుకుపడింది. ఆ దేశంలోని అణు స్థావరాలు, ఆర్మీ కీలక నేతలు, న్యూక్లియర్​ సైంటిస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో ఇరాన్​ కూడా ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Israel | విమర్శలు రావడంతో..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు అవ్‌నర్‌, అమిత్‌ యార్దేనీకి సోమవారం వివాహం జరగాల్సి ఉంది. అయితే దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రధాని ఇంట్లో పెళ్లి ఏమిటని విమర్శలు వచ్చాయి. గాజాపై ఇజ్రాయెల్​ దాడుల సమయం నుంచే ఈ విమర్శలు ఉన్నాయి. గాజాలో ఐడీఎఫ్​ దళాలు పోరాడుతుంటే.. ప్రధాని ఇంట పెళ్లి వేడుకలు ఏమిటని గతంలో సైతం పలు విమర్శలు చేశాయి. తాజాగా ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. దీంతో ప్రధాని తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Israel | ఇరాన్​ ప్రతిదాడులు

ఇజ్రాయెల్​ తమ దేశంపై దాడి చేయడంతో ఇరాన్​ తీవ్రంగా స్పందించింది. ఆ దేశం వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్​పై విరుచుకుపడింది. ఆపరేషన్​ ట్రూ ప్రామిస్​ 3 (True Promise 3) పేరిట దాడులు చేపట్టింది. కాగా.. ఇరాన్​ ప్రయోగించిన పలు డ్రోన్ల, క్షిపణులను ఇజ్రాయెల్ ఐరన్​ డోమ్​ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది. కొన్ని మాత్రం పలు ప్రాంతాల్లో పడడంతో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్​ దాడుల్లో ఆదివారం 10 మంది మరణించారని, 180 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్​ పోలీసులు తెలిపారు.