Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad city | రోడ్లపైకి నీళ్లొస్తున్నాయి.. సమస్యను పరిష్కరించండి..

Nizamabad city | రోడ్లపైకి నీళ్లొస్తున్నాయి.. సమస్యను పరిష్కరించండి..

నగర శివారులోని బోర్గాం(పి)లోని శ్రీసాయి లక్ష్మీనగర్​లో ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని కాలనీవాసులు వాపోయారు. నిజాంసాగర్ కాలువ ద్వారా సాగునీరు ఇళ్లలోకి వచ్చి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad city | బోర్గాం(పి)లోని శ్రీ సాయి లక్ష్మీనగర్​లోకి నిజాంసాగర్ కాలువ (Nizamsagar canal) ద్వారా సాగునీరు వచ్చి చేరుతుందని కాలనీవాసులు వాపోయారు. ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అదనపు కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. ఠాణాఖుర్దు నుంచి సాగునీరు (irrigation water) కాలనీలోని ఇళ్లముందుకు చేరుతోందన్నారు. దీంతో నడవలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

Nizamabad city | రాత్రి సమయాల్లో పరిస్థితి అధ్వానం..

రాత్రి సమయాల్లో వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా ఉండడం లేదని వివరించారు. ఈ నీటిని మార్గంలో పంపి తమ కాలనీవాసుల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి దేవేందర్, కోశాధికారి సురేష్, జలంధర్, లింగం, శివ, శ్రీనివాస్, సాయి రామ్, సుధాకర్, గోపాల్ తదితరులు ఉన్నారు.