అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyberabad Police | ఓ ఉద్యోగి తాను పని చేస్తున్న కంపెనీనే మోసం చేశాడు. నకిలీ పత్రాలతో రూ.5.30 కోట్లు కాజేసి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించాడు.
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) అసిస్టెంట్ మేనేజర్గా భాస్కరభట్ల సూర్యనారాయణ శాస్త్రి పని చేస్తున్నాడు. ఫేక్ ఇన్వాయిస్లు, ఆఫీస్ నోట్స్, కొటేషన్లు సృష్టించి ఆయన రూ.5.30 కోట్ల నిధులను కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించాడు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు ఆమోదించిన నోట్ ఫైళ్లను ఉపయోగించి ఆయన మోసానికి పాల్పడ్డాడు.
Cyberabad Police | నకిలీ పత్రాలతో..
హైదరాబాద్ (Hyderabad)లోని షేక్పేటకు చెందిన సూర్యనారాయణ శాస్త్రి ఐఆర్డీఏఐ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. నిందితుడు సంస్థ ప్రాసెస్ చేసిన నకిలీ చెల్లింపు ఫైళ్ల నుంచి నిధులను ఉన్నతాధికారుల ఆమోదం కోసం మళ్లించడానికి ముందస్తు ప్లాన్ చేశాడు. నకిలీ ఇన్వాయిస్లు సృ ష్టించాడు. బ్యాంక్ ఖాతాల స్థానంలో తన కుటుంబ సభ్యుల వివరాలు ఇచ్చాడు. ఆయా ఫైళ్లను ఉన్నతాధికారులు ఆమోదించిచడంతో ఆడిట్ విభాగం ప్రాసెస్ చేసింది. అయితే ఆ నిధులు విక్రేతలకు కాకుండా నిందితుడి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా రూ.5.30 కోట్లను సూర్యానారాయణ శాస్త్రి దుర్వినియోగం చేశాడు.
Cyberabad Police | అప్పులపాలై..
నిందితుడు ఇతరుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నాడు. వాటిని తీర్చడానికి సంస్థ నిధులను దారి మళ్లించాలని ప్లాన్ వేశాడు. చెల్లింపు ఫైళ్లను సిద్ధం చేయడానికి ఫేక్ ఇన్వాయిస్లు, ఆఫీస్ నోట్లు, కొటేషన్లను సృష్టించాడు. ఈ మేరకు సంస్థ ఫిర్యాదు చేయడంతో సూర్యనారాయణ శాస్త్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.