HomeUncategorizedBharat Gaurav Yatra | ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ.. భారత్​ గౌరవ్​ యాత్రతో ఐదు జ్యోతిర్లింగాల...

Bharat Gaurav Yatra | ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ.. భారత్​ గౌరవ్​ యాత్రతో ఐదు జ్యోతిర్లింగాల దర్శనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bharat Gaurav Yatra | రైల్వే శాఖ ప్రయాణికుల అవసరాల మేరకు చర్యలు చేపడుతోంది. రద్దీ ఉన్న మార్గాల్లో రైళ్లను పెంచడంతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. వేగంగా వెళ్లడానికి ఇప్పటికే వందే భారత్​ రైళ్లను (Vande Bharat Trains) నడుపుతోంది. అంతేగాకుండా యాత్రికులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రైళ్లను నడుపుతోంది. భారత్​ గౌరవ్​ యాత్ర పేరిట పలు క్షేత్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ.. ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. ఐఆర్​సీటీసీ (IRCTC) ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీతో రైళ్లను నడుపుతోంది.

భారత్​ గౌరవ్​ ప్రత్యేక పర్యాటక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) నుంచి ఆగస్టు 16న బయలుదేరుతుంది. ఈ రైలు ద్వారా పంచ (5) జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. 8 రాత్రులు, తొమ్మిది రోజులు ఈ యాత్ర కొనసాగుతోంది. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్ క్షేత్రాలను దర్వించుకోచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముథ్కేడ్, నాందేడ్, పూర్ణా స్టేషన్​లలో ఆగుతుంది.

Bharat Gaurav Yatra | టికెట్ ధరలు

ఈ టూర్​ ప్యాకేజీలో భాగంగా స్లీపర్​ క్లాస్​ టికెట్​ రూ.14,700గా నిర్ణయించారు. థర్డ్​ ఏసీ రూ.22,900, సెకండ్​ ఏసీ రూ.29,900 టికెట్​ చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రోజుకు మూడు పూట భోజనం, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. వివరాల కోసం వెబ్‌సైట్ www.irctctourism.com, 97013 60701, 92810 30740 ఫోన్​ నంబర్లను సంప్రదించాలని రైల్వే అధికారులు సూచించారు.