HomeUncategorizedIMF | పాక్​కు లోన్​ ఇవ్వొద్దు.. ఐఎంఎఫ్​ను కోరిన భారత్​

IMF | పాక్​కు లోన్​ ఇవ్వొద్దు.. ఐఎంఎఫ్​ను కోరిన భారత్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IMF | పాకిస్తాన్​ను (pakistan) భారత్​ అష్ట దిగ్బంధనం చేస్తోంది. ఆపరేషన్​ సిందూర్​కు (operation sindoor) ప్రతీకారంగా ఆ దేశంలో భారత్​పై దాడులకు తెగబడుతోంది. దీంతో భారత్​ (india) పాక్​ దాడులను (pakistan attacks) తిప్పి కొడుతోంది. పాక్​ మిసైల్స్​, డ్రోన్లు, యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్ (india shot down Pakistani missiles, drones and fighter jets)​ ఇప్పటికే త్రివిధ దళాలతో ఆ దేశాన్ని చుట్టుముట్టింది. ఐఎన్​ఎస్​ విక్రాంత్​ అరేబియా సముద్రంలో మోహరించి కరాచి పోర్ట్​పై దాడి (INS vikarant deployed in Arabian Sea and attacked Karachi Port) చేసింది. పాక్​లోని కీలక నగరాలపై భారత్​ దాడులు (india attack on pakistan main citys) చేస్తోంది. మరోవైపు అంతర్జాతీయంగా సైతం ఆ దేశాన్ని భారత్​ ఒంటరి చేస్తోంది. పాక్​ దాడులు, ఉగ్రవాదులకు చేస్తున్న సాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి (united nations) భారత్​ అందజేసింది.

తాజాగా పాక్​కు అప్పు పుట్టకుండా భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. పాకిస్తాన్​కు ఇచ్చే రుణాలను సమీక్షించాలని ఐఎంఎఫ్​ (IMF)ను కోరింది. పాకిస్తాన్ 1.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీపై (pakistan 1.3 billion dollar package) నేడు ఐఎంఎఫ్​ సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో రుణం (loan) ఇవ్వొద్దని భారత్​ కోరింది. పాక్​కు రుణం ఇస్తే ఉగ్రవాద కార్యకలాపాల (terrorist activities) కోసం వినియోగిస్తోందని భారత్​ వాదిస్తోంది.