HomeతెలంగాణInter Results | ఇంటర్​లో ‘దారి’ తప్పుతున్నారు.. ఫెయిల్​ అవడానికే కారణాలివే..

Inter Results | ఇంటర్​లో ‘దారి’ తప్పుతున్నారు.. ఫెయిల్​ అవడానికే కారణాలివే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Results | రాష్ట్రంలో ఒక తరం దారి తప్పుతోంది. అవును మీరు విన్నది నిజమే. స్మార్ట్​ ఫోన్ smart phone​, సోషల్​ మీడియా social media, సెన్సిటివ్​ పెరెంటింగ్ sensitive parenting​ కారణంగా విద్యార్థులు చదువుల్లో తప్పుతున్నారు. ఆ తర్వాత జీవితాల్లో చాలా కోల్పోతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్​ ఫలితాలే inter results ఇందుకు నిదర్శనం. పదో తరగతిలో tenth class ఏదోలా పాస్​ అవుతున్న విద్యార్థులు ఇంటర్​కు వచ్చే సరికి దారి తప్పుతున్నారు.

పదో తరగతిలో మంచి మార్కులతో పాసైన వారు ఇంటర్​ వచ్చే సరికి ఫెయిల్​ అవుతున్నారు. 2023 పదో తరగతి విద్యార్థులు 86.6శాతం పాసయ్యారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు ఇంటర్​ సెకండియర్​ పూర్తి చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది సెకండియర్​ ఉత్తీర్ణత శాతం 71.37 కావడం గమనార్హం. అదే 2024లో పదో తరగతిలో 91.31శాతం మంది పాస్​ అయ్యారు. వారు ప్రస్తుతం ఇంటర్​ ఫస్టియర్​ పరీక్షలు రాశారు. ఇందులో 66.89శాతం మందే ఉత్తీర్ణత సాధించారు.

Inter Results | గత మూడేళ్లలో ఇంటర్​లో ఉత్తీర్ణత శాతం

2023: ఫస్టియర్​లో గర్ల్స్​ 68.68 శాతం, బాయ్స్​ 54.66 శాతం.

సెకండియర్​లో గర్ల్స్ 71.57 శాతం, బాయ్స్​ 55.60 శాతం

2024: ఫస్టియర్​లో గర్ల్స్ 68.35 శాతం, బాయ్స్​ 51.50 శాతం

సెకండియర్​లో గర్ల్స్ 72.53 శాతం, బాయ్స్​ 56.10 శాతం

2025: ఫస్టియర్​లో గర్ల్స్ 73.83 శాతం, బాయ్స్​ 57.83 శాతం

సెకండియర్​లో గర్ల్స్ 74.21శాతం, బాయ్స్​ 57.31 శాతం

Inter Results | ఎందుకిలా..

ఇంటర్​ interకు వచ్చే సరికి చాలా మంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ కనబర్చడం లేదు. అధ్యాపకులు, కాలేజీ, పరీక్షలను లెక్క చేయని వారు సైతం ఉన్నారు. ముఖ్యంగా బాలురు boys కాలేజీలకు సక్రమంగా వెళ్లడం లేదు. పట్టణాల్లోని కార్పొరేట్​ కాలేజీల్లో మినహా మిగతా చోట్ల చాలా మంది కాలేజీలకు మొక్కుబడిగా వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని rural areas కాలేజీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు సక్రమంగా వెళ్లడం లేదు. గతంలో కామారెడ్డి kamareddy జిల్లాలోని ఓ కళాశాల అధ్యాపకులు దయచేసి కాలేజీకి రండి అంటూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరి కోరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Inter Results | స్మార్ట్​మాయ

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్​ఫోన్ smart phone​ ఉంది. ఇంటర్​కు రాగానే విద్యార్థులకు తల్లిదండ్రులు ఫోన్లు కొనిస్తున్నారు. ఈ స్మార్ట్​ మాయలో పడిన విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి సోషల్​ మీడియాలో మునిగి తేలుతున్నారు. అంతేగాకుండా తల్లిదండ్రులు కూడా అతి గారబంగా పెంచుతున్నారు. దీంతో తల్లిదండ్రుల మాటను పిల్లలు లెక్క చేయడం లేదు. తల్లిదండ్రులే పిల్లలు చెప్పినట్లు వింటున్నారు. పెద్ద ఫోన్లు, పెద్ద పెద్ద బైక్​లు కొనివ్వమని కోరుతూ.. వాటిపై జల్సాలు చేస్తున్న కొందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్లడం లేదు. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుంది. ఇది రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక, సామాజిక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Must Read
Related News