అక్షరటుడే, వెబ్డెస్క్: Inspector postings | మల్టీజోన్–1 పరిధిలో ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీ అయిన వారిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఇందుకు సంబంధించి సీపీ సాయిచైతన్య బుధవారం ఆర్డర్ జారీ చేశారు. సీసీఆర్బీలో ఉన్న ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ను నిజామాబాద్ నాలుగో టౌన్ ఎస్హెచ్వోగా నియమించారు. అలాగే వీఆర్లో ఉన్న సీహెచ్.శ్రీనివాస్ను నిజామాబాద్ రూరల్ పీఎస్ ఎస్హెచ్వోగా పంపించారు. వెయిటింగ్లో ఉన్న అశోక్కు ఎన్ఐబీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాగా.. త్వరలోనే వీరు బాధ్యతలు స్వీకరింంచనున్నారు.
Inspector postings | ఎస్హెచ్వోలుగా అప్గ్రేడ్
నిజామాబాద్ నాలుగో ఠాణా, రూరల్ పోలీస్ స్టేషన్లకు ఇది వరకు ఎస్సైలు ఎస్హెచ్వోలుగా వ్యవహరించేవారు. కాగా.. ఆయా ఠాణాల పరిధిలో కేసులు పెరగడం, శాంతి భద్రతల పరిరక్షణ తదితర కారణాల రీత్యా ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్వోలుగా నియమించాలని సీపీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన పంపిన ప్రతిపాదనకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆమోదం తెలిపారు. తదనుగుణంగా ఇన్స్పెక్టర్లను ఎస్హెచ్వోలుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఠాణాల అప్గ్రేడేషన్కు సంబంధించి తదుపరి ఉత్తర్వులు అతి త్వరలో రానున్నాయి.
