అక్షరటుడే, వెబ్డెస్క్ : Inflation | రాష్ట్రంలో మరోసారి మైనస్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జూన్, జులై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదు అయింది.
ద్రవ్యోల్బణం పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో మైనస్లోకి వెళ్లడంతో వస్తువుల రేట్లు తగ్గుతున్నాయి. ఆయా వస్తువులకు డిమాండ్ లేకపోతే ఈ పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో అక్టోబర్లో –1.16 ద్రవ్యోల్బణం నమోదైంది. సెప్టెంబర్ (September) నెలకు సంబంధించి –0.15 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం.
తెలంగాణ (Telangana) ఏర్పడినప్పటి నుంచి నాలుగో సారి మైనస్ ద్రవ్యోల్బణం నమోదు అయింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జూన్, జులై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ద్రవ్యోల్బణం సున్న కంటే తక్కువగా ఉండటంతో ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఎక్కువగా ఉంటే రేట్లు పెరుగుతున్నట్లు లెక్క. ఇది మైనస్లో ఉందంటే.. గత నెలతో పోలిస్తే రేట్లు తగ్గినట్లు అర్థం. అయితే రేట్లు తగ్గితే మంచిదే కాదా అంటారా.. అక్కడే తిరకాసు ఉంది.
Inflation | డిమాండ్ లేకపోవడంతో..
ఏదైనా వస్తువుకు డిమాండ్ ఉంటే రేట్లు పెరుగుతాయి. డిమాండ్ (Demand) లేకపోతే రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం తెలంగాణలో డిమాండ్ లేకపోవడంతోనే నెగిటివ్లో ద్రవ్యోల్బణం నమోదు అవుతుంది. ఉద్యోగాలు లేకపోవడం, ప్రజల చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఫలితంగా మార్కెట్లు ఖాళీగా ఉంటున్నాయి. రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్ లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (State Economy)పై కూడా ప్రభావం చూపుతుంది. రాష్ట్రానికి పన్నుల (Tax) రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది.
Inflation | గతంలో సైతం..
తెలంగాణలో గతంలో సైతం ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్లింది. జూన్లో మైనస్ 0.93 శాతం, జులైలో –0.44గా, సెప్టెంబర్లో –0.15 శాతంగా నమోదు అయింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పడు కూడా ద్రవ్యోల్బణం మైనస్లో నమోదు కాలేదు. తాజాగా ఒకే ఆర్థిక సంవత్సరంలో నాలుగు సార్లు ఢిఫ్లేషన్ నమోదు కావడంతో ఆర్థిక విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. కాగా సెప్టెంబర్తో పోలిస్తే ద్రవ్యోల్బణం మరింత తగ్గడం గమనార్హం.
