Homeజిల్లాలునిజామాబాద్​indiramma Housing Scheme | అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

indiramma Housing Scheme | అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

ఆర్మూర్​ మండలంలోని అంకాపూర్​లో అర్హులైన పేదలకు డబుల్​ బెడ్​రూం ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ పట్టణంలోని తహశీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: indiramma Housing Scheme | అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) కేటాయించాలని సీపీఐఎంఎల్​ ప్రజాపంథా రాష్ట్ర నాయకుడు దేవరాం, ఏఐకేఎంఎస్​ నిజామాబాద్​ రూరల్​, కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకుడు ఆకుల గంగారాం డిమాండ్​ చేశారు.

ఆర్మూర్ మండలం అంకాపూర్​ గ్రామంలో (Ankapur village) అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఆర్మూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అంకాపూర్ డబుల్ బెడ్​రూం స్కీంలో (double bedroom scheme) మొదట పేదల పేర్లు చేర్చి ఇళ్లు పూర్తయ్యాక లబ్ధిదారుల పేర్లు మార్చేయడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొన్నారు.

డబుల్​ ఇళ్ల మంజూరులో అవకతవకలను వెలికి తీయాలని.. పేదలకు న్యాయం చేయాలని కోరుతూ మూడు రోజులుగా ఆర్మూర్​ తహశీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. అధికారులు స్పందించకపోతే దీక్షా శిబిరాన్ని కలెక్టర్​ కార్యాలయం అక్కడి నుంచి హైదరాబాద్​ సీఎం క్యాంప్​ ఆఫీస్​కు మారుస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌతమి, రాజమణి, అబ్బమ్మ, సావిత్రి, రమణి, పోసాని, నర్సయ్య, గణేశ్​, ప్రజాపంథా ఆర్మూర్ సంయుక్త మండల కార్యదర్శి కిషన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ బాధ్యులు రాజన్న, నిఖిల్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.