అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Committee | ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మోస్రా మండల కేంద్రంలో గురువారం యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇంతియాజ్(Youth Congress leader Imtiaz) ఆధ్వర్యంలో రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నందున ఇందిరమ్మ ఇళ్ల కమిటీ(Indiramma House Committee)ల్లో చోటు కల్పించాలని వారు కోరారు. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసన్ గౌడ్, నాయకులు నర్సారెడ్డి, సాయిలు, పోచయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
