అక్షరటుడే, వెబ్డెస్క్ : Indira Gandhi | భారత్ – పాకిస్తాన్ కాల్పుల విరమణ ceasefire కు అంగీకరించడంతో ప్రస్తుతం నెట్టింట ఇందిరాగాంధీ indira gandhi పై జోరుగా చర్చ నడుస్తోంది. ఎక్స్లో ఆమె ట్రెండింగ్లో ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్కు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పీవోకే, పాక్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఈ ఘటలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించారు.
Indira Gandhi | మనదే పైచేయి అయినా..
భారత్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ భారత్పై దాడికి దిగింది. డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులతో భారత ప్రజలు, ఎయిర్బేస్లు, ఎయిర్పోర్టులే లక్ష్యంగా దాడులు యత్నించింది. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ దాడులను అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, మిసైళ్లను భారత బలగాలు మధ్యలోనూ కూల్చివేశాయి. అంతేగాకుండా భారత్ ప్రతిదాడులు చేపట్టి పాక్లోని పలు ఆర్మీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత్దే పైచేయిగా ఉన్న సమయంలో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
Indira Gandhi | ధీరవనిత ఇందిరా..
ప్రస్తుత దాడుల సమయంలో భారత్ సరైన ప్రణాళికతోనే ముందుకు వెళ్లింది. పాక్ దాడులను తిప్పి కొట్టడంతో పాటు ఆ దేశంలోని పలు మిలిటరి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అసలే ఆర్థిక సంక్షోభం ఉన్న పాక్ యుద్ధం చేసే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో భారత్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందని పలువురు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1971 యుద్ధం సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ పాక్ పీచమణిచి బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యం ఇచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ధీర వనిత ఇందిరా గాంధీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
నాడు ఆమె పాకిస్తాన్కు సాయం చేసే దేశాలను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పెద్ద దేశాలు తమకు ఆదేశాలు జారీ చేయాలనే దుస్సహసం చేయొద్దని ఆమె అప్పుడు హెచ్చరించారు. అప్పుడే ఇందిరా గాంధీ పాక్ ఆట కట్టించారని, ప్రస్తుతం మంచి అవకాశాన్ని భారత్ వదులుకుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Indira Gandhi | పాక్, చైనా వక్ర బుద్ధి
కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ మళ్లీ వక్రబుద్ధి చూపెట్టింది. కుక్క తోక వంకర అన్నట్లు శనివారం రాత్రి డ్రోన్లతో దాడులు చేపట్టింది. మరోవైపు నియంత్రణరేఖ వెంబడి కాల్పులు జరిపింది. ఈ దాడులను భారత బలగాలు తిప్పికొట్టాయి. పాక్ దాడులపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పాక్ బాధ్యత వహించాల్సి ఉంటున్నారు. భారత్ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు చైనా సైతం పాక్కు మద్దతు తెలపడం గమనార్హం. పాక్ భూ భాగాన్ని భారత్ ఆక్రమిస్తే తాము చూస్తూ ఊరుకోమని చైనా పేర్కొంది. కాగా పాక్ మళ్లీ దాడులు చేయడంతో భారత్ యుద్ధం ప్రకటించాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.