అక్షరటుడే, న్యూఢిల్లీ: India pakisthan war : జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాక్ దాడులకు తెగబడిందని భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.
కాగా, భారత ప్రతీకార దాడుల వల్ల రెండు JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఇది తీవ్రమైన నష్టం అంటూ పాకిస్తాన్ భావోద్వేగంగా ప్రకటన చేసింది. ఈ ఘటనలో జవాన్లను సైతం కోల్పోయినట్లు పాక్ పేర్కొంది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాకిస్తాన్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోంది.