అక్షరటుడే, వెబ్డెస్క్: Ind – Pak | జమ్మూ కశ్మీర్ (jammu kashmir)లోని పహల్గామ్ (pahalgam)లో పర్యాటకులపై ఉగ్రదాడి terror attack తర్వాత భారత్ bharat తీసుకునే నిర్ణయాలతో పాకిస్తాన్ pakistan ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తూనే.. పాక్పై ఆర్థిక యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్కు అప్పు పుట్టకుండా ఐఎంఎఫ్ దగ్గర భారత్ అభ్యంతరం తెలిపింది.
Ind – Pak | పూర్తిగా వాణిజ్యం రద్దు
ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ పాక్తో వాణిజ్యాన్నిTrades నిలిపివేయడంతో పాటు, సింధూ నది Indus River జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వ్యవసాయం, సాగుకు కీలకమైన సింధూ నది జలాలు రాకపోతే పాక్ ఏడారిగా మారడం ఖాయం. ఇంతలోనే భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్తో పూర్తిగా వాణిజ్యం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే వాణిజ్యం రద్దయినా.. పరోక్షంగా పాక్ నుంచి ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. తాజాగా వీటిని కూడా నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. దొడ్డిదారిన పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పరోక్ష దిగుమతులను ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో ఆ దేశం మరిన్ని కష్టాలు ఎదుర్కోనుంది.