HomeUncategorizedIndia - China | చైనాపై భారత్​ ఆగ్రహం..

India – China | చైనాపై భారత్​ ఆగ్రహం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:India – China | చైనా వైఖరిపై భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్​ ప్రదేశ్​ విషయంతో డ్రాగన్​ దేశానికి కౌంటర్​ ఇచ్చింది. అరుణాచల్​ ప్రదేశ్(Arunachal Pradesh)​లోని పలు ప్రాంతాల పేర్లను చైనా తన మ్యాప్​లో మార్చింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. పేర్లు మార్చినంత సులువుగా నిజాలను మార్చలేరని స్పష్టం చేసింది. అరుణాచల్​ ప్రదేశ్​ ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమేనని పేర్కొంది.

అరుణాచల్​ ప్రదేశ్​(Arunachal Pradesh)లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టడానికి చైనా యత్నించడాన్ని తాము గమనించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌(Randhir Jaiswal) తెలిపారు. అలాంటి ప్రయత్నాలను తాము తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అరుణాచల్​ ప్రదేశ్​ భారత్​లో అంతర్భాగం అని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ నిజాన్ని మార్చలేరని ఆయన అన్నారు. గతంలో సైతం చైనా ఇలాగే అరుణాచల్​ ప్రదేశ్​లోని పలు ప్రాంతాల పేర్లు మారుస్తూ జాబితా విడుదల చేసింది. అయితే భారత్(Bharath)​ చైనా తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతోంది.

India – China | ఆ దేశ ఎక్స్ ఖాతాపై నిషేధం

భారత్​ చైనాకు మరో షాక్​ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ ఎక్స్​ అకౌంట్(Global Times X Account) నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై గ్లోబల్​ టైమ్స్​ ఫేక్​ ప్రచారం చేసిందని భారత్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఆపరేషన్​ సిందూర్​ అనంతర ఉద్రిక్తతల వేళ చైనా పాక్​కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్తాన్(Pakistan)​ భూభాగాన్ని భారత్​ ఆక్రమిస్తే తాము చూస్తూ ఊరుకోమని చైనా పేర్కొంది.

Must Read
Related News