Homeక్రీడలుWorld Cup Final | మహిళా ప్రపంచకప్​ ఫైనల్​లో రాణించిన భారత్​.. సౌత్​ ఆఫ్రికా టార్గెట్​...

World Cup Final | మహిళా ప్రపంచకప్​ ఫైనల్​లో రాణించిన భారత్​.. సౌత్​ ఆఫ్రికా టార్గెట్​ 299

సౌత్​ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో భారత మహిళలు రాణించారు. షెఫాలి వర్మ 87, దీప్తి శర్మ హాప్​ సెంచరీతో అదరగొట్టారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : World Cup Final | మహిళా వన్డే ప్రపంచకప్​లో భాగంగా సౌత్​ ఆఫ్రికా (South Africa)తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో భారత జట్టు రాణించింది. మొదట టాస్​ గెలిచిన సౌత్​ ఆఫ్రికా బౌలింగ్​ ఎంచుకుంది. భారత బ్యాటర్లు రాణించడంతో 50 ఓవర్లలో 298 స్కోర్​ చేసింది.

వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్​ ఆలస్యంగా ప్రారంభం అయింది. టాస్​ ఓడి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మందాన(45), షెఫాలీ వర్మ (87) రాణించారు. వీరి తొలి వికెట్​కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సెమీ ఫైనల్​లో మ్యాచ్​ గెలిపించిన జెమీమా వన్​ డౌన్​లో వచ్చి పర్వాలేదనిపించింది. 37 బంతుల్లో ఆమె 24 పరుగులు చేసింది. షెఫాలీ తృటిలో సెంచరీ మిస్​ చేసుకుంది. కెప్టెన్​ హర్మీన్​ ప్రీత్​ కౌర్​ 20 పరుగులతో నిరాశ పరిచింది. అమ్​జోత్​ కౌర్​ 12 పరుగులకే అవుట్​ అయింది. దీప్తి శర్మ (58) హాఫ్​ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా గోష్​ 24 బంతుల్లో 34 పరుగులతో చివర్లో మెరుపులు మెరిపింది. దీంతో భారత్​ 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది.

World Cup Final | బౌలర్లు రాణిస్తే..

సౌత్​ ఆఫ్రికా బౌలర్లు అయబోగా ఖక 3, నాన్కులులేకో మ్లాబా, క్లెర్క్​, చోలె ట్రయన్​ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్​లో గెలిస్తే భారత్​ తొలిసారి ప్రపంచ కప్​ గెలుచుకుంటుంది. గతంలో రెండు సార్లు ఫైనల్​ వరకు వెళ్లిన భారత మహిళలు రన్నరప్​తో సరిపెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా గెలిచినా.. ఆ జట్టుకు తొలి కప్​ కానుంది. భారత గెలుపు ఇక బౌలర్లపై ఆధారపడి ఉంది. ఆదిలోనే వికెట్లు తీస్తే భారత్​ గెలుపు సులువు అవుతుంది.