అక్షరటుడే, న్యూఢిల్లీ: Nationwide high alert : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ నిర్వహించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రతిదాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధం అవుతోంది.
ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బతో ఆగం అయిన పాక్ ఏమి చేయాలో పాలుపోక సరిహద్దు వెంట కాల్పులు కొనసాగిస్తోంది. పూంఛ్, కుప్వారా, కర్నాహ్లో హోరాహోరీ కాల్పులు జరుపుతోంది. పాక్ దాడిలో సరిహద్దు గ్రామాల్లో నలుగురు పిల్లలు సహా 15 మంది అమాయక ప్రజలు మరణించారు. కాగా, పాక్ కాల్పులను భారత్ ఆర్మీ దీటుగా ఎదుర్కొంటోంది. ఇండియన్ ఆర్మీ ప్రతిదాడితో పాక్ సేనలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ వీర మరణం పొందారు. పూంచ్ సెక్టార్ దగ్గర పాక్ బలగాల కాల్పుల్లో దినేష్కుమార్ అనే జవాన్ మరణించారు.
