International Space Station | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి.. పయనం ఎప్పుడంటే..

అక్షరటుడే, న్యూఢిల్లీ: International Space Station : భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లబోతున్నారు. యాక్సియమ్ – 4 (Ax-4) మిషన్​ (Axium-4 (Ax-4) mission)లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు మే 29న ‘ఐఎస్ఎస్’కు పయనం కానున్నారు. భారత్-అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ మిషన్​లో గ్రూప్ కెప్టెన్ శుక్లాను ఇదివరకే ఇస్రో (ISRO) ఎంపిక చేసింది. యాక్సియమ్ స్పేస్ అమెరికాకు చెందిన సంస్థ. […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: International Space Station : భారత వ్యోమగామి శుభాన్ష్ శుక్లా (Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లబోతున్నారు. యాక్సియమ్ – 4 (Ax-4) మిషన్​ (Axium-4 (Ax-4) mission)లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు మే 29న ‘ఐఎస్ఎస్’కు పయనం కానున్నారు. భారత్-అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ మిషన్​లో గ్రూప్ కెప్టెన్ శుక్లాను ఇదివరకే ఇస్రో (ISRO) ఎంపిక చేసింది.

యాక్సియమ్ స్పేస్ అమెరికాకు చెందిన సంస్థ. దీనికి ఇది నాలుగో ఐఎస్ఎస్ మిషన్. మే 29న కెనడీ స్పేస్ సెంటర్ Kennedy Space Center నుంచి స్పేస్ఎక్స్ వ్యోమనౌక(SpaceX spacecraft)లో నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్​కు వెళ్తున్నట్లు సంస్థ ప్రకటించింది. భారత్​కు చెందిన శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), టిబర్ కపు (హంగరీ), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్) ఈ జాబితాలో ఉన్నారు. వీరు రెండు వారాలపాటు ఐఎస్ఎస్​లో ఉండబోతున్నారు.

యాక్సియమ్-4 మిషన్​లో భాగంగా ఏడు ప్రయోగాల్లో శుభాన్ష్​ శుక్లా పాల్గొననున్నట్లు చెబుతున్నారు. అంతరిక్షంలో పంట సాగు, టార్డిగ్రేడ్ (నీటి ఎలుగుబంటి) గురించి అధ్యయనం చేయనున్నట్లు పేర్కొంటున్నారు.

కాగా.. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుక్లానే అతిపిన్న వయస్కుడిగా ఉన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Delhi Bomb Threat | ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు

ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎర్రకోటతో పాటు రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్లు దుండగులు మెయిల్​ పంపారు.

Trump Tariffs Suspended | రేపటి నుంచి నిలిచిపోనున్న ట్రంప్​ టారిఫ్​లు

పలు దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు రేపటి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.