Homeబిజినెస్​Indian Airlines | ప్రత్యామ్నాయ మార్గాలపై భారత విమానయాన సంస్థల ఫోకస్​

Indian Airlines | ప్రత్యామ్నాయ మార్గాలపై భారత విమానయాన సంస్థల ఫోకస్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian Airlines | జమ్మూకశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్​గామ్​ Pahalgam ఉగ్రదాడి అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశం పాక్​కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం రద్దు, పాక్​ పౌరుల వీసాల రద్దులతో పాటు, పాక్​ ఎంబసీ అధికారుల (Pakistan Embassy Officials) కుదింపు తదితర చర్యలు తీసుకుంది. దీంతో పాకిస్తాన్​ సైతం ప్రతిచర్యగా భారత విమానాలకు పాక్​ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి.

Indian Airlines | పలు దేశాల ప్రయాణంపై ఎఫెక్ట్​

పాక్​ తన గగనతలాన్ని మూసివేయడంతో పలు దేశాలకు ప్రయాణ సమయం పెరుగనుంది. అమెరికాAmerica, లండన్London, యూరప్ Europe, పశ్చిమాసియా దేశాలకు West Asia ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఈ దిశగా భారత విమానయాన సంస్థలు ఫోకస్​ చేశాయి. అయితే ఆల్టర్నేటివ్​ రూట్స్​లో ప్రయాణించడం వల్ల దూరం పెరుగుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు విమాన టికెట్​ ధరలు flight charges hike పెరగనున్నాయి. ఇప్పటికే ఎయిర్​ ఇండియాతో air india పాటు ఇండిగో indigo సంస్థలు ప్రయాణికులకు కలుగనున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నాయి.