HomeUncategorizedMiG -21 | ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక నిర్ణయం.. మిగ్​–21 సేవలకు వీడ్కోలు

MiG -21 | ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక నిర్ణయం.. మిగ్​–21 సేవలకు వీడ్కోలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: MiG -21 | దశాబ్దాలు భారత సైన్యానికి సేవలు(Indian Army Services) అందిస్తున్న మిగ్​ –21 ఇక కనుమరుగు కానున్నాయి. ఈ మేరకు భారత వైమానిక దళం(Indian Air Force) కీలక నిర్ణయం తీసుకుంది. మిగ్​ –21 యుద్ధ విమనాలు పాత తరానికి చెందినవి. ప్రస్తుత పరిస్థితులకు అవి అనుకూలం కావు. దీంతో పాటు మిగ్​ –21 విమానాలు తరుచూ కూలిపోయేవి. దీంతో వీటిని ఎగిరే శవపేటికలు అని ఎద్దేవా చేసేవారు. ఈ క్రమంలో వీటిని వాడొద్దని ఐఏఎఫ్‌ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ నుంచి మిగ్‌-21(MIG – 21) యుద్ధవిమానాలకు దశల వారీగా తొలగించనున్నట్లు తెలిపింది.

MiG -21 | తేజస్​తో భర్తీ

మిగ్​–21 యుద్ధ విమానాలను రష్యా నుంచి భారత్​ కొనుగోలు చేసింది. సుమారు 62 ఏళ్లుగా ఇవి భారత్​కు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో 36 మిగ్​ –21 విమానాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు ఇవి భారత గగనతల రక్షణలో కీలక పాత్ర పోషించాయి. 1963లో మొదటి సారి భారత్​లోకి మిగ్​ 21 వచ్చింది. తర్వాత సుఖోయ్​ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే వరకు మిగ్​–21 విమానాలు భారత వైమానిక దళంలో అనేక సేవలు అందించాయి.

మిగ్​–21 యుద్ధ విమానాల(MIG – 21 Fighter Jets) స్థానాన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్​ భర్తీ చేయాలని ఐఏఎఫ్​ యోచిస్తోంది. మిగ్‌21 విమానం చివరిసారిగా రాజ‌స్థాన్‌లోని బార్మ‌ర్ నుంచి 2023లో ఎగిరింది. వీటి స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్(Light Combat Aircraft Jet​)​లను వినియోగిస్తామని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రి(Air Chief Marshal VR Chowdhury) వెల్లడించారు.

MiG -21 | ఆ యుద్ధాల్లో కీలక పాత్ర

భారత్​ – పాకిస్తాన్​ మధ్య జరిగిన 1965 యుద్ధం, బంగ్లాదేశ్​ విముక్తి సమయంలో 1971 జరిగిన యుద్ధంలో మిగ్​–21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. 1999 కార్గిల్ యుద్దం, 2019 బాలకోట్ వైమానిక దాడుల్లో సైతం ఇవీ సేవలు అందించాయి. మిగ్​ 21 యుద్ధ విమానాలను భారత్ మొదట రష్యా నుంచి కొనుగోలు చేసింది. అనంతరం సాంకేతిక బదిలీ చేయడంతో 600 విమానాలు భారత్​లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) తయారు చేసింది.