India US Interim Trade Deal | ‘మధ్యంతర’ ఎఫెక్ట్.. ఏ పదార్థాల ధరలు తగ్గుతాయంటే?

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : India US Interim Trade Deal | సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ -అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు వచ్చేనెలలో సంతకాలు చేయనున్నాయి. ఆ తర్వాత పలు ఉత్పత్తులపై అమెరికా (America) తన సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది. భారత్ కొన్నింటిపై సుంకాలను సున్నా చేయనుంది. అయితే భారత్ రైతులకు ఎలాంటి నష్టం లేకుండా.. కొన్ని వస్తువులపై మాత్రమే సుంకాలను ఈ ఒప్పందంలో భాగంగా తగ్గించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : India US Interim Trade Deal | సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ -అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాలు వచ్చేనెలలో సంతకాలు చేయనున్నాయి. ఆ తర్వాత పలు ఉత్పత్తులపై అమెరికా (America) తన సుంకాలను 18 శాతానికి తగ్గించనుంది.

భారత్ కొన్నింటిపై సుంకాలను సున్నా చేయనుంది. అయితే భారత్ రైతులకు ఎలాంటి నష్టం లేకుండా.. కొన్ని వస్తువులపై మాత్రమే సుంకాలను ఈ ఒప్పందంలో భాగంగా తగ్గించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Trade Agreement) కుదిరిన నేపథ్యంలో అమెరికా నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు.

ధరలు తగ్గే ఆహార ఉత్పత్తుల వివరాలు తెలుసుందామా..

బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గనున్నాయి.

తాజా పండ్లతోపాటు ప్రాసెస్ చేసిన పండ్లపై దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. అయితే భారతదేశ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వీటిపై కనీస దిగుమతి ధర నిబంధన మాత్రం కొనసాగునుంది.

సోయాబీన్ ఆయిల్‌ (Soybean Oil)పై సుంకాలు తగ్గనున్నందున ధరలు దిగివచ్చే అవకాశాలున్నాయి.

పశువులు, కోళ్ల మేతలో వాడే ప్రొటీన్ పదార్థాలు, ఎర్ర జొన్నలపై దిగుమతి సుంకాలు తగ్గుతాయి. దీనివల్ల దాణా తయారీ ఖర్చు తగ్గి, పరోక్షంగా దానిపై ఆధారపడే పలు రంగాలకు లబ్ధి చేకూరనుంది.

కనీస దిగుమతి ధర కొనసాగుతున్నప్పటికీ అమెరికన్ వైన్‌తోపాటు ఇతర స్పిరిట్‌ల ధరలు కూడా తగ్గనున్నాయి.

కొన్నింటిపై పాత సుంకాలే..

భారతదేశం తన రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు కొన్నింటిపై సుంకాల తగ్గింపునకు మన ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో పలు ఉత్పత్తులపై పాత సుంకాలే కొనసాగనున్నాయి.

గోధుమలు, వరి, మక్క, జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, బార్లీ, ఓట్స్ వంటి ఉత్పత్తులపై పాత సుంకాలే అమలు కానున్నాయి.
పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఉత్పత్తులు, చికెన్, ఇతర మాంసాలు, బంగాళాదుంపలు, బఠానీలు, చిక్కుళ్లు, పుట్టగొడుగులు వంటివి కూడా మధ్యంతర వాణిజ్య ఒప్పందం పరిధిలో లేవు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...