అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్పై దాడికి మూడు యుద్ధ విమానాలను పంపింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఒక ఎఫ్–16తో పాటు రెండు జేఎఫ్17 విమానాలను కూల్చివేసింది. అంతేకాకుండా పాక్ జమ్మూ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి యత్నించగా.. వాటిని సైతం న్యూట్రలైజ్ చేసింది.
