అక్షరటుడే, వెబ్డెస్క్: India Pakistan T20 Match | టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడబోమని గత కొద్ది రోజులుగా కఠిన వైఖరి ప్రదర్శించిన పాకిస్థాన్ చివరకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. ముందుగా లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తామని సంకేతాలు ఇచ్చిన పాక్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) తాజాగా వెనక్కి తగ్గి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడేందుకు అంగీకరించడం ప్రపంచ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ పరిణామంతో ఎంతో ఉత్కంఠ రేపిన ఇండియా–పాకిస్థాన్ పోరుకు అధికారికంగా మార్గం సుగమమైంది.ఈ అంశంపై పాకిస్థాన్తో చర్చలు జరిపేందుకు ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా (Deputy Chairman Imran Khawaja) స్వయంగా లాహోర్కు వెళ్లినట్టు సమాచారం.
India Pakistan T20 Match | మ్యాచ్కి గ్రీన్ సిగ్నల్..
అక్కడ పీసీబీ ప్రతినిధులతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) సభ్యులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అంతర్జాతీయ టోర్నమెంట్ ప్రతిష్ట, ఆర్థిక ప్రయోజనాలు, క్రికెట్ వ్యవస్థ స్థిరత్వం వంటి అంశాలను చర్చల్లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సంప్రదింపుల అనంతరం పాకిస్థాన్ తన ముందస్తు వైఖరిని సడలించి మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చర్చల సందర్భంగా పీసీబీ ఐసీసీ (ICC) ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచినట్టు తెలిసింది. ముఖ్యంగా భారత్–పాకిస్థాన్–బంగ్లాదేశ్ జట్ల మధ్య త్రైపాక్షిక సిరీస్ నిర్వహించాలని సూచించింది. అయితే ఈ ప్రతిపాదనపై ఐసీసీ స్పష్టంగా నిరాకరణ తెలిపినట్టు సమాచారం. ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సిరీస్లు ఆయా దేశాల బోర్డుల పరిధిలోని విషయాలేనని, గ్లోబల్ టోర్నమెంట్ షెడ్యూల్కు అవి సంబంధం లేదని ఐసీసీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కీలక పాత్ర పోషించింది. ప్రపంచ క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగాలని బీసీబీ పాకిస్థాన్ను అభ్యర్థించినట్టు సమాచారం. ఈ హై వోల్టేజ్ పోరు రద్దయితే టోర్నమెంట్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఆడాలని పీసీబీకి పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Government) కూడా సూచనలు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పరిణామాలన్నింటి ఫలితంగా ఈ నెల 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్–పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరగడానికి మార్గం సుగమమైంది.