అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని ఎరువుల గోదాములను (Fertilizer warehouses) అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని నల్లవెల్లి, ఇందల్వాయి సహకార సంఘాల పరిధిలోని గోడౌన్లను శనివారం పరిశీలించారు. తహశీల్దార్ వెంకట్రావు (Tahsildar Venkat Rao), మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎరువుల నిల్వలను తెలుసుకున్నారు.
అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ నిర్ణయించిన ధర ప్రకారమే రైతులకు ఎరువులు అమ్మాలని సూచించారు. ఎరువులు కొన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు సైతం అవసరం మేరకే ఎరువులు కొనాలని కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. ఆయన వెంట పీఏసీఎస్ ఛైర్మన్లు గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆలూర్ పీఏసీఎస్ గోదాంలో..

ఆలూర్మండల కేంద్రంలో గోదాములో రికార్డులను తనిఖీ చేస్తున్న తహశీల్దార్ రమేశ్, తదితరులు
అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను తహశీల్దార్ రమేష్, ఏవో రాంబాబు శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఎరువుల నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. డీలర్లు ఈపాస్ సిస్టమ్ ద్వారా ఎరువులు విక్రయించాలన్నారు. మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్, ఎంపీడీవో గంగాధర్, ఏడీఏ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.