అక్షరటుడే, వెబ్డెస్క్ :Ind – Pak | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్– పాక్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. రెండు దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.
ఇప్పటికే ఇరు దేశాలు సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించాయి. మరోవైపు ప్రధాని మోదీ(Prime Minister Modi) ఉగ్రదాడి, అనంతర చర్యలపై కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ajit doval, త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సమయాన్ని బట్టి సైన్యం గట్టిగా బదులు ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), అధికారులతో, తర్వాత ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్(RRS President Mohan Bhagwat)తో సమావేశం నిర్వహించారు.
Ind – Pak | 36 గంటల్లో దాడి చేస్తుంది..
భారత్(India) చర్యలతో ఆందోళన చెందుతున్న పాక్(Pakistan) తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతోంది. భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందని పాక్ అనుమానిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 36 గంటల్లో భారత్ తమపై దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు.
దీంతో పాక్ వాయుసేనను అప్రమత్తం చేసింది. లాహోర్, ఇస్లామాబాద్ మధ్య వైమానిక మార్గం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 2 వరకు పౌర విమానాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. పాక్ మంత్రి అతవుల్లా తరారు(Pakistan Minister Ataullah Tarar) మాట్లాడుతూ.. భారత్ తమపై దాడికి సిద్ధం అవుతోందన్నారు. ఒకవేళ భారత్ దాడి చేస్తే తమ నుంచి ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.