ePaper
More
    Homeక్రీడలుIND vs ENG : భారత్-ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ

    IND vs ENG : భారత్-ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇంగ్లండ్ పర్యటన(England tour)కు వెళ్లే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 20 మంది ఆటగాళ్లతో కూడిన జంబో టీమ్‌ వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు సన్నాహకంగా భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్(India A – England Lions) జట్లు రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడనున్నాయి.

    అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్-ఏ టీమ్‌లో సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్(Shubman Gill, Sai Sudarshan) రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తారని బీసీసీఐ(BCCI) తెలిపింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్‌ల(Telugu star Nitish Kumar Reddy, Dhruv Jurel, Ishan Kishan, Sarfaraz Khan)కు భారత్-ఏ జట్టులో చోటు కల్పించారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించిన కరుణ్ నాయర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఎంపిక చేశారు.

    ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ఆటగాళ్లకు భారత ప్రధాన జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత్-ఏ టీమ్‌ మే 25 తర్వాత ఇంగ్లండ్ బయల్దేరే అవకాశం ఉంది. భారత్-ఏ జట్టులో ఉండి.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడే ఆటగాళ్లు ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. మే 30 నుంచి అనధికారిక టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అందరూ ఊహించనట్లుగానే శ్రేయస్ అయ్యర్‌‌‌ను ఎంపిక చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(Virat Kohli, Rohit Sharma) టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వారి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    భారత్-ఏ జట్టు: అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(కీపర్), మానవ్ సుతార్, తనూష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...