Homeక్రీడలుIND vs AUS women | భారత్​పై ఆసీస్​ మహిళల జట్టు గెలుపు

IND vs AUS women | భారత్​పై ఆసీస్​ మహిళల జట్టు గెలుపు

IND vs AUS women : మహిళల వన్డే వరల్డ్‌ కప్‌: ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. భారత్‌ 330 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs AUS women విశాఖ Visakhapatnam వేదికగా నిర్వహించిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025) మ్యాచ్​లో టీమిండియా (Team India) కు ఓటమి తప్పలేదు.

ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా (Australia) మధ్య జరిగిన పోరు చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్​లో ఆసీస్ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని కంగారు మహిళలు 49 ఓవర్లలోనే ఛేదించారు.

IND vs AUS women | ఓపెనర్​లు రాణించినా..

టాస్​ గెలిచిన ఆసీస్​ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. దీంతో మొదట భారత్​ బ్యాటింగ్​ చేపట్టింది. ఓపెనర్లు ప్రతిక రావల్ (Pratika Rawal), స్మృతి మందాన (Smriti Mandhana) మంచి భాగస్వామ్యాన్ని ప్రదర్శించారు.

మందాన 66 బంతుల్లో (9 ఫోర్లు, 3 సిక్సర్లు) 80 పరుగులు చేసింది. ప్రతిక రావల్ 96 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్సర్) 75 పరుగులు చేసింది.

చివరలో భారత్ జట్టు వేగంగా వికెట్లను కోల్పోవడంతో 48.5 ఓవర్లలో 330 రన్స్​ చేసి ఆలౌట్ అయింది. 331 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలో కొంచెం ఇబ్బంది పడింది.

అలీస్సా హీలీ (Alyssa Healy) బ్యాటింగ్​ చేపట్టాక మ్యాచ్ ఆసీస్ వైపు తిరిగింది. ఈమె 107 బంతుల్లో 142 పరుగులు చేసింది. ఉమన్​ ఆఫ్ ది మ్యాచ్​గా హీలీ నిలిచింది.