అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (nagireddy pet) మండలాల వరప్రదాయని పోచారం ప్రాజెక్టులోకి (Pocharma Project) వరదనీరు చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి (Gandhari) పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల ద్వారా 1,515 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12.6 అడుగులకు నీరు చేరుకుంది. గత ఏడాది ఈ సమయానికి ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. కానీ ఈఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నేటికీ ప్రాజెక్టు నిండలేదు. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి రెండు మండలాలల్లో పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.