అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వేంకటేశ్వర స్వామిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.